జగన్ చరిత్రలో నిలిచిపోతారు: ఆర్ కృష్ణయ్య ప్రశంసలు

| Edited By:

Nov 01, 2020 | 9:14 AM

ఏపీలో ఉన్న 139 బీసీ కులాలను గుర్తించి, వాటికి అనుగుణంగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం, వాటికి చైర్మన్లను నియమించడం ద్వారా సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని

జగన్ చరిత్రలో నిలిచిపోతారు: ఆర్ కృష్ణయ్య ప్రశంసలు
Follow us on

R Krishnaiah praises YS Jagan: ఏపీలో ఉన్న 139 బీసీ కులాలను గుర్తించి, వాటికి అనుగుణంగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం, వాటికి చైర్మన్లను నియమించడం ద్వారా సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీ కులాలన్నీ జగన్‌కి రుణపడి ఉంటాయని ఆయన అన్నారు. శనివారం గుంటూరు, చిలకలూరిపేటల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. (కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,416 కొత్త కేసులు.. 5 మరణాలు)

బీసీల సమస్యలపై తాను వివిధ రాష్ట్రాల్లో పోరాడుతున్నానని, కానీ ఏపీలో మాత్రం ఆ అవకాశం లేదని, జగన్ సీఎంగా ఉండటమే అందుకు కారణమని అన్నారు. అప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి బీసీలపై చిత్తశుద్ధితో వ్యవహరించారని, ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌ ఒక అడుగు ముందుకేసి బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారని ప్రశంసలు కురిపించారు. (Bigg Boss 4: కంటెస్టెంట్‌ల కళ్లు తెరిపించిన నాగార్జున)