అద్వానీ అండ లేకపోతే మోదీ కథ అప్పుడే ముగిసేది

| Edited By: Pardhasaradhi Peri

May 16, 2019 | 7:32 PM

అద్వానీ అండ లేకపోతే మోదీ కథ 2002లోనే ముగిసేదంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో దేశాన్ని కుదిపేసిన గోద్రా అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో రాజీనామా చేయించాలని వాజ్‌పేయి భావించారని సిన్హా పేర్కొన్నారు. రాజీనామాకు మోదీ తిరస్కరిస్తే ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనకు వాజ్‌పేయి వచ్చారని చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో మోదీకి అప్పటి కేంద్ర హోంమంత్రి అద్వానీ రూపంలో పెద్ద […]

అద్వానీ అండ లేకపోతే మోదీ కథ అప్పుడే ముగిసేది
Follow us on

అద్వానీ అండ లేకపోతే మోదీ కథ 2002లోనే ముగిసేదంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో దేశాన్ని కుదిపేసిన గోద్రా అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో రాజీనామా చేయించాలని వాజ్‌పేయి భావించారని సిన్హా పేర్కొన్నారు. రాజీనామాకు మోదీ తిరస్కరిస్తే ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనకు వాజ్‌పేయి వచ్చారని చెప్పుకొచ్చారు.

అయితే ఆ సమయంలో మోదీకి అప్పటి కేంద్ర హోంమంత్రి అద్వానీ రూపంలో పెద్ద అండ దొరికిందని పేర్కొన్నారు. మోదీని పదవి నుంచి తప్పిస్తే తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అద్వానీ బెదిరించారని, దీంతో వాజ్‌పేయి వెనక్కి తగ్గారని సిన్హా అప్పటి పరిస్థితిని వివరించారు. ఆ రోజు వాజ్‌పేయి వెనక్కి తగ్గకుండా ఉంటే మోదీ కథ అప్పుడే ముగిసి ఉండేదని యశ్వంత్ సిన్హా అన్నారు.