ఏపీ ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌కు హైకోర్టు బ్రేక్‌.. ఫిబ్రవరి 9 వరకు యాప్‌ను వినియోగించొద్దని ధర్మాసనం ఆదేశాలు

|

Feb 05, 2021 | 3:05 PM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మంగా రూపొందించిన ఇ-వాచ్‌ యాప్‌కు బ్రేకులేసింది హైకోర్టు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన..

ఏపీ ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌కు హైకోర్టు బ్రేక్‌.. ఫిబ్రవరి 9 వరకు యాప్‌ను వినియోగించొద్దని ధర్మాసనం ఆదేశాలు
ap-high-court
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మంగా రూపొందించిన ఇ-వాచ్‌ యాప్‌కు బ్రేకులేసింది హైకోర్టు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ యాప్‌పై అభ్యంతరాలు వచ్చాయి. ఈరోజు హైకోర్టులో దీనిపై విచారణ సాగింది. వాదనలు విన్న కోర్టు.. ఎస్‌ఈసీ ఇ-వాచ్‌ యాప్‌పై స్టేటస్‌ కో ఇచ్చింది.

ఫిబ్రవరి 9 వరకు ఈవాచ్‌ యాప్‌ను వినియోగించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది హైకోర్టు. తదుపరి విచారణ ఈనెల 9కి వాయిదా వేసింది.రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్‌ఈసీ తయారు చేసిన యాప్‌నకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేషన్ వచ్చేంతవరకు, ఈ యాప్‌‌ వినియోగాన్ని నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

కాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ- వాచ్‌ పేరుతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఓ యాప్‌ను విడుదల చేశారు. దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. అయితే ప్రైవేటు యాప్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది న్యాయస్థానం.

ఎస్‌ఈసీ రూపొందించిన ఈ- వాచ్‌ యాప్‌కు సెక్యూరిటీ సర్టిఫికెట్‌ ఉందా అని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, 5 రోజుల్లో తీసుకువస్తామని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఈ యాప్‌ను ఉపయోగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది.

 

Read more:

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై భగ్గుమన్న గంటా.. ఉద్యమానికి జేగంట భజాయిస్తామన్న టీడీపీ ఎమ్మెల్యే