తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైకాపాలో చేరారు. గత ఎన్నికల్లో అమలాపుర౦లో తెలుగుదేశం తరఫున గెలిచిన ఆయన వైకాపా అధినేత జగన్తో సోమవారం భేటీ అయి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపాలో చేరడం తనకు పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబుతో రాష్ట్రానికి ఏమీ రావన్నారు. ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం మేలు చేస్తోందని ఆరోపించారు. తనకు తెదేపా ఎంపీ సీట్ ఇవ్వకపోవడంతోనే వైకాపాలో చేరుతున్నాననేది అబద్దమని కొట్టిపారేశారు.