Bhuma Akhila Priya: ఆళ్లగడ్డ రాజకీయం మళ్లీ వేడెక్కింది.. రసవత్తరంగా భూమా – గంగుల వర్గాల మధ్య పోరు.. సవాళ్లు

|

Aug 01, 2021 | 8:15 PM

ఆళ్లగడ్డ పాలిటిక్స్‌ మళ్లీ వేడెక్కింది. భూమా- గంగుల వర్గాల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. గ్రావెల్ తవ్వకాలు తాజాగా..

Bhuma Akhila Priya: ఆళ్లగడ్డ రాజకీయం మళ్లీ వేడెక్కింది.. రసవత్తరంగా భూమా - గంగుల వర్గాల మధ్య పోరు.. సవాళ్లు
Akhila Priya
Follow us on

Allagadda Politics: ఆళ్లగడ్డ పాలిటిక్స్‌ మళ్లీ వేడెక్కింది. భూమా- గంగుల వర్గాల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. గ్రావెల్ తవ్వకాలు తాజాగా అగ్గి రాజేశాయి. ఎమ్మెల్యే, MLCల అక్రమాలను అధికారులను అడ్డుకోకుంటే.. పోరుబాట తప్పదన్నారు భూమా అఖిలప్రియ. ఎర్రమట్టి తవ్వకాల వ్యవహారంపై టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా ఇవాళ అఖిలప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. ఆళ్లగడ్డలో యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని అఖిల ఆరోపించారు.

నర్సాపురం, కృష్ణాపురంలో ఎస్సీల పేరుతో వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారని అఖిలప్రియ చెప్పుకొచ్చారు. సీజ్ చేసిన వాహనాలు వైసీపీ నేతల ఇళ్ల వద్ద ఉంటున్నాయని ఆమె విమర్శించారు. వైసీపీ నేతలకే తవ్వకాల అనుమతులు ఇస్తున్నారని అఖిలప్రియ విమర్శించారు.

నర్సాపురం, కృష్ణాపురంలో వారం రోజుల్లో అక్రమ తవ్వకాలు ఆగకపోతే తామే అడ్డుకుంటామని అఖిల ప్రియ హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఈ అక్రమాల్లో భాగం ఉందని అఖిల ఆరోపించారు.

Read also: Nagarjuna Sagar: సాగర్‌లో రేపు సీఎం పర్యటన, 144 సెక్షన్.. క్రస్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో పర్యాటకులు రావద్దని ఆదేశాలు