uppula Raju |
Oct 09, 2021 | 5:57 AM
వరదలు వచ్చినప్పుడు మీకు తినడానికి ఏమి దొరకదు. కానీ థాయిలాండ్లోని ఈ రెస్టారెంట్ ఎన్ని వరదలు వచ్చినా తెరిచే ఉంటుంది.
థాయ్లాండ్లోని చావోఫ్రయా నది ఉప్పొంగడంతో వరద నీరు అనేక ప్రాంతాల్లోకి చేరింది. కానీ ఈ వరద నీటిలో కూడా ఇక్కడ ఉన్న టిటిపోర్న్ అనే రెస్టారెంట్ తెరిచి ఉంచారు.
దీంతో ప్రజలు తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. పడవలలో వెళ్లే ప్రయాణికులు కూడా ఇక్కడకు వచ్చి టీ తాగుతున్నారు.
టిటిపోర్న్ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ సమయంలో ప్రజలకు సేవ చేయాలని తలంచి వరదలలో కూడా రెస్టారెంట్ నడిపిస్తున్నారు.
నీటిలో తడిసిన కుర్చీలపై కూర్చొని కస్టమర్లు వేడి వేడిగా ఆహారాన్ని తింటున్నారు. ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.