Tirumala: ఘనంగా మలయప్ప స్వామి రథోత్సవం.. మాఢవీధుల్లో పోటెత్తిన భక్తులు..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. రథ సప్తమి అంటే సూర్యభగవానుడి జయంతి అని అర్థం. సమస్త జీవకోటి మనుగడకు మూలం ఆదిత్యుడు. అలాంటి రవిపై మలయప్ప స్వామి అధిరోహించి సకల చరాచర సృష్టిని సాఫీగా నడిపించేందుకు సూర్యప్రభ వాహనంపై అధిరోహిస్తారు.