వంటలు చేసేటప్పుడు ఒక్కోసారి కూరల్లో ఉప్పు లేదా కారం అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా తినాలనిపించదు. దీంతో వీటిని పారేసి మళ్లీ వండుతారు. కష్టపడి వండిన శ్రమంతా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఒక్కసారి ఈ చిట్కాలు ట్రై చేయండి.
కూరల్లో ఉప్పు అనేది ఎక్కువైతే.. బంగాళ దుంపలను నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేసి.. ఓ పది నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా చేస్తే.. ఉప్పు తగ్గుతుంది. ఉప్పు ఎక్కువైనప్పుడు నిమ్మరసం అనేది కలిపితే.. ఉప్పు అనేది సరి అవుతుంది.
కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు.. కొద్దిగా పాలు కానీ, పెరుగు కానీ కలపండి. అప్పుడు ఉప్పదనం తగ్గుతుంది. రుచి కూడా పెరుగుతుంది. ఉప్పు ఎక్కువైనప్పుడు ఉల్లి గడ్డ ముక్కలు లేదా టమాటా ముక్కలు కట్ చేసి వేసి.. ఓ పది నిమిషాలు నీళ్లు పోసి ఉడకనివ్వండి. ఉప్పు అనేది తగ్గుతుంది.
ఒక్కోసారి నీళ్లు కలపడం వల్ల కూడా ఉప్పదనం తగ్గుతుంది. అలాగే ఉప్పు ఎక్కువైతే కొద్దిగా కొబ్బరి పాలను కలపండి. ఇలా చేయడం వల్ల కూరలో ఉప్పదనం తగ్గి.. రుచి పెరుగుతుంది. అదే విధంగా చక్కెర కలిపినా కూడా ఉప్పు అనేది తగ్గుతుంది.
ఉప్పు ఎక్కువైనప్పుడు గోధుమ పిండిని కలిపి ఉండలుగా చేసి.. కూరలో వేసి ఓ ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించాలి. గోధుమ పిండి కూరలోని ఉప్పును గ్రహించి.. ఉప్పదనాన్ని తగ్గిస్తుంది. కూరల్లో కారం ఎక్కువైనప్పుడు కూడా ఇప్పుడు చెప్పిన చిట్కాలు ఉపయోగపడతాయి.