బాలీవుడ్లో సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసి గ్లోబల్ స్టార్గా ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రజెంట్ హాలీవుడ్లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న పీసీ... ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్తో టచ్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు పీసీ.
హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ ది బ్లఫ్ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా, ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అంటున్నారు. గతంలో ఏళ్ల తరబడి ఇండియాకు దూరంగానే గడిపేసిన ఈ బ్యూటీ ఈ మధ్య తరుచూ ముంబై మీడియాలో కనిపిస్తున్నారు.
ఈ మధ్య ఓ బిగ్ వెడ్డింగ్ ఈవెంట్లో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చారు ప్రియాంక. ఈ సందర్భంగా భర్తతో కలిసి చాలా రోజులు ఇండియాలోనే గడిపారు. రెగ్యులర్గా ఇలా ఇండియా టూర్ వేస్తుండటంతో పీసీ మళ్లీ ఇండియాకు షిఫ్ట్ అవుతున్నారా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.
పర్సనల్ లైఫ్ విషయంలోనే కాదు, ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోనూ హోం ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టారు పీసీ. ఆ మధ్య సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీకి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. గతంలో భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో నటించారు పీసీ.
తాజాగా తన కెరీర్ను మలుపు తిప్పిన మరో సినిమాకు సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. 2008లో రిలీజ్ అయిన ఫ్యాషన్ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఈ మూవీలో నటించేందుకు పీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.