పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చర్మాన్ని సంరక్షించుకోవాలంటే డైట్ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సిందే. చర్మం వయస్సు గుర్తు. కనుక వయసు పెరిగే కొద్దీ చర్మానికి ఆ శోభ ఉండదు. కనుక స్కిన్ యవ్వనంగా గ్లో గా ఉండేలా చూసుకోవాలంటే తినే ఆహారంలో మాత్రమే కాదు కొన్ని రకాల ఇంటింటి చిట్కాలకు పాటించాల్సి ఉంటుంది.
అలాంటి పండ్లలో పైనాపిల్ ఒకటి. ఈ పండు చర్మానికి చాలా మేలు చేస్తుంది. పైనాపిల్లో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ లేదా AHAలు ఉంటాయి, ఇవి చర్మానికి మేలు చేస్తాయి. పైనాపిల్లో విటమిన్ సీ, ఏ లతో పాటు ఈ జ్యూసీ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండులోని పోషక విలువ అంతులేనివి.
ఈ ఆనాస పండుని తినడానికి మాత్రమే కాదు సౌందర్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. పైనాపిల్ చర్మం ముడతలు, మొటిమలు, మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. పైనాపిల్లోని కొల్లాజెన్ అందాన్ని పెంచుతుంది.
స్నానానికి ముందు కొన్ని పైనాపిల్ ముక్కలను తీసుకుని చర్మంపై మృదువుగా రుద్దండి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది.
పైనాపిల్, గుడ్డు పచ్చసొన, పాలు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేయాలి. పొడిగా అయిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీంతో చాలా మొటిమల సమస్యలు తొలగిపోతాయి.