Viral: ఫ్రెండ్‌ కలలోకి వచ్చి చెప్పాడని.. ఈ యువకుడు ఏం చేశాడో తెలిస్తే షాకే

| Edited By: Ravi Kiran

Aug 02, 2024 | 4:15 PM

హత్య కేసులో నిందితుడ్ని విచారిస్తున్న పోలీసులు.. అతడిచ్చిన వాంగ్మూలం విని విస్తుపోయారు. చనిపోయిన ఫ్రెండ్ కలలోకి వచ్చి పగ తీర్చుకోవాలని కోరడంతో.. ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేసి.. ముక్కలు ముక్కలుగా నరికి.. పూడ్చినట్లు వెల్లడించాడు. ఆ వివరాలు ఇలా..

Viral: ఫ్రెండ్‌ కలలోకి వచ్చి చెప్పాడని.. ఈ యువకుడు ఏం చేశాడో తెలిస్తే షాకే
Representative Image
Follow us on

హత్య కేసులో నిందితుడ్ని విచారిస్తున్న పోలీసులు.. అతడిచ్చిన వాంగ్మూలం విని విస్తుపోయారు. చనిపోయిన ఫ్రెండ్ కలలోకి వచ్చి పగ తీర్చుకోవాలని కోరడంతో.. ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేసి.. ముక్కలు ముక్కలుగా నరికి.. పూడ్చినట్లు వెల్లడించాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో కరూర్‌లో వెలుగుచూసింది. స్థానికంగా గాంధీ అనే ప్రాంతానికి చెందిన సెంథిల్‌కు.. 19 ఏళ్ల జీవా అనే తనయుడు ఉన్నాడు. అతడు తిరువూర్‌లో ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. జులై 22న సెలవు పెట్టి కరూర్‌కు వచ్చాడు. ఆ తర్వాత అతడి ఆచూకీ తెలియలేదు.

కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన తంథోనిమలై పోలీసులు.. ఇన్వెస్టిగేషన్ షురూ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్, ఇతర డేటా సేకరించిన అనంతరం.. గాంధీ ప్రాంతానికే చెందిన శశికుమార్‌పై అనుమానం కలిగింది. అతడిని విచారించగా.. జీవాను దారుణంగా హత్య చేసి.. ఇండస్ట్రియల్ ఏరియాకు సమీపాన ఉన్న ఫారెస్ట్ ఏరియాలో పూడ్చినట్లు ఒప్పుకున్నాడు. మరో 10 మంది వ్యక్తులు తనకు సహకరించినట్లు వెల్లడించాడు. జీవా హత్య కేసులో గాంధీ గ్రామానికే చెంది 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకుపోయిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ హత్య కేసులో శశికుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ విని పోలీసులు నిర్ఘాంతపోయారు.

మోహన్ అనే వ్యక్తి, తాను కరూర్‌ మిత్రులమని, 2021లో పారిశ్రామికవాడలోని అటవీ ప్రాంతంలో మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో లిక్కర్ సేవించినట్లు శశికుమార్ తెలిపాడు. అప్పుడు తాము తాగిన మద్యంలో విషం కలిపి ఇచ్చారని, ఇద్దరం అది తాగినా.. తాను బతికి.. మోహన్ మృతి చెందినట్లు వెల్లడించాడు. మద్యంలో విషం కలిపేందుకు జీవా సహకరించిట్లు తెలిపాడు. మోహన్‌ తన కలలో వచ్చి.. తనను చంపిన వారిపై పగ తీర్చుకోవాలని కోరాడని, అందుకే మరికొందరి మిత్రుల సహకారంతో జీవాను చంపేశామని శశికుమార్‌ వాంగ్మూలం ఇవ్వడం సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి