డ్రగ్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న పెద్ద సమస్య. యువత ఎక్కువగా ఈ మత్తు మాయలో పడి విలువైన భవిష్యత్ను పాడు చేసుకుంటుంది. ఇండియాలో కూడా ఇటీవల కాలంలో డ్రగ్స్ వినియోగం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రోజూ దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుబడుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. విదేశాల నుంచి కూడా డ్రగ్స్ను ఇండియాకు తరలించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ను మన దేశానికి తరలించేందుకు స్మగ్లర్స్ చేస్తున్న ప్రయత్నాలు పోలీసులను, అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా డ్రగ్స్ రవాణా చేస్తున్న విదేశీ మహిళను ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్యూర్ కొకైన్ను క్యాప్సూళ్లలో నింపి.. పొట్టలో దాచుకొని ఆమె స్మగ్లింగ్ చేసేందుకు యత్నించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 51 క్యాప్సూల్స్ను ఆమె శరీరం నుంచి రికవరీ చేశారు. ఆఫ్రికాలోని మాళవి దేశానికి చెందిన ఆ మహిళ… ఇథియోపియా మీదుగా ఢిల్లీకి వచ్చిందని అధికారులు తెలిపారు.
గ్రీన్ ఛానెల్ను దాటే క్రమంలో ఆమె అధికారులు పట్టుకున్నారు. ఆపై ఆ మహిళను ఆర్ఎంఎల్ హాస్పిటల్క తరలించారు. 7 రోజుల పాటు ప్రయత్నించి కడుపులో నుంచి మొత్తం క్యాప్సూల్స్ అన్ని బయటకు తీశారు. ఈ క్యాప్సుళ్లలోని కొకైన్ విలువ రూ.9.11 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మే 27న మహిళ ఢిల్లీకి వచ్చిందని తెలిపారు. కాగా తొలుత చెకింగ్లో ఆమె ఏదో నిషేధిత పదార్థాలు తీసుకెళ్తున్నట్లు తేలింది. బ్యాగులను చెక్ చేయగా.. ఏం దొరకలేదు. ఆ తర్వాత అనుమానం వచ్చి ఆ తర్వాత ఆమె శరీరాన్ని పరీక్షించగా.. కడుపులో ఏదో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత మహిళను కస్టడీలోకి తీసుకొని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించి.. ఆమె పొట్టలో నుంచి 607 గ్రాముల ఫ్యూర్ కొకైన్ను బయటకు తీశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి