PM Modi: ప్రధాన మంత్రి కార్యాలయం ప్రజల కేంద్రంగా ఉండాలి: మోడీ

|

Jun 10, 2024 | 5:48 PM

ప్రధాన మంత్రి కార్యాలయం ప్రజల కేంద్రంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ కార్యాలయం మోదీ కేంద్రీకృత‌మైనదిగా ఉండకూదని అన్నారు. దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోడీ.. ఆ తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో పీఎంవో సిబ్బందితో మాట్లాడారు. ఇప్పటి వరకు పీఎంవో కార్యాలయం అధికార కేంద్రంగా ఉండేదని, కానీ ప్రజలకు పీఎంవోగా ఉండాలని విశ్వసిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. త‌మ‌కు ఒకటే

PM Modi: ప్రధాన మంత్రి కార్యాలయం ప్రజల కేంద్రంగా ఉండాలి: మోడీ
Pm Modi
Follow us on

ప్రధాన మంత్రి కార్యాలయం ప్రజల కేంద్రంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ కార్యాలయం మోదీ కేంద్రీకృత‌మైనదిగా ఉండకూదని అన్నారు. దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోడీ.. ఆ తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో పీఎంవో సిబ్బందితో మాట్లాడారు. ఇప్పటి వరకు పీఎంవో కార్యాలయం అధికార కేంద్రంగా ఉండేదని, కానీ ప్రజలకు పీఎంవోగా ఉండాలని విశ్వసిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. త‌మ‌కు ఒకటే ల‌క్ష్యం ఉంద‌ని, ఈ దేశ‌మే ప్ర‌ప్ర‌థ‌మం అన్నారు.

 


ఒకే స్పూర్తితో ప‌నిచేస్తున్నామ‌ని, 2047 నాటికి విక‌సిత భార‌త్ నిర్మించాలని మోడీ సూచించారు. త‌న జీవితంలోని ప్ర‌తి క్ష‌ణం దేశం కోసమేనని పేర్కొన్నారు.

 

 

మోదీకి మాత్రమే కాకుండా ప్రజల పీఎంవోగా ఉండాలని తాను ఎప్పటినుంచో నమ్ముతున్నానని అన్నారు. “2014కి ముందు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అధికార కేంద్రంగా చూసేవారు. అది మోడీది కాదు.. ప్రజల PMO అని నేను ఎప్పుడూ నమ్ముతాను” అని ప్రధాని అన్నారు. ఈ విజయం భారత ప్రభుత్వ ఉద్యోగులు అని, వారు ఒక విజన్ కోసం తమను తాము అంకితం చేసుకున్నారని ప్రధాన మంత్రి అన్నారు. ఎవరూ చేరుకోని స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్ళాలని కోరారు.

 


జూన్ 9న ప్రధాని మోదీ చారిత్రాత్మక మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. క్యాంపస్‌లోకి అడుగుపెట్టగానే పీఎంవో సిబ్బంది చప్పట్లతో స్వాగతం పలికారు. మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, రాబోయే సంవత్సరాల్లో మనం ప్రపంచ ప్రమాణాలకు మించి పనిచేయాలని ప్రధాని మోదీ ప్రసంగించారు. అన్ని దేశాల కంటే మన దేశాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలన్నారు.

 

ప్రభుత్వం అంటే కొత్త శక్తి, అంకితభావం, తీర్మానాలు అని ఆయన అన్నారు. భారత ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విజయానికి అర్హులు, ఒక విజన్ కోసం తమను తాము అంకితం చేసుకోవడంలో ఎటువంటి తమ శక్తులను వదిలిపెట్టలేదన్నారు.

 

140 కోట్ల మంది తప్ప నా మనసులో ఎవరూ లేరని, నాకు 140 కోట్ల మంది పౌరులు కాదు, వారు నాకు భగవంతుని స్వరూపం. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు 140 కోట్ల మంది దేశప్రజలను ఈ విధంగా పూజించినట్లు భావిస్తానని మోడీ వ్యాఖ్యానించారు.

 

చాలా మంది కోరికలు అస్థిరంగా ఉంటాయని, ఇది అల లాంటిది. అస్థిరమైన కోరికలు ప్రపంచం దృష్టిలో అలలు. కోరికలు ఎక్కువ కాలం స్థిరత్వాన్ని పొందినప్పుడు అవి తీర్మానాలుగా మారుతాయని ప్రధాని అన్నారు. మనం చేసే ప్రతిదానికి అత్యధిక ప్రయత్నం చేసినప్పుడు విజయం సాధిస్తామని వ్యాఖ్యానించారు.