బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై దాడి.. కారు ధ్వంసం..!

| Edited By:

Jul 01, 2020 | 3:12 PM

వెస్ట్‌ బెంగాల్‌లో అధికార టీఎంసీ పార్టీకి, బీజేపీకి మధ్య వార్‌ కొనసాగుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై దాడి.. కారు ధ్వంసం..!
Follow us on

వెస్ట్‌ బెంగాల్‌లో అధికార టీఎంసీ పార్టీకి, బీజేపీకి మధ్య వార్‌ కొనసాగుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పైనే దాడి జరిగింది. బుధవారం ఉదయం నార్త్ పరగణాలోని ఓ టీ కొట్టు వద్దకు చేరుకున్నాడు. అయితే అక్కడ టీ తాగుతుండగా.. అక్కడ అధికార పార్టీకి చెందిన కొందరు కార్తకర్తలు తనపై దాడి చేశారని తెలిపారు. అంతేకాదు.. ఆయన కారును కూడా ధ్వంసం చేశారు. తనను దాడి నుంచి కాపాడేందుకు యత్నించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. అసలు అధికార టీఎంసీ సమస్య ఏంటో తెలియడం లేదని.. వరుసగా బీజేపీ అధికారులను, కార్యకర్తలను టార్గెట్‌గా దాడులు చేయడం ఏంటో అర్ధం కావడంలేదని దిలీప్ ఘోష్ అన్నారు.