ఉచ్చు బిగుస్తుండటంతో స్వరం మార్చిన లిక్కర్ కింగ్‌

| Edited By:

Jul 18, 2020 | 4:23 AM

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఉచ్చు బిగుస్తోంది. దేశంలోని పలు బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టి.. విదేశాలకు జారుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న ఆయనను.. ఇక త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం ఆయన్ను..

ఉచ్చు బిగుస్తుండటంతో స్వరం మార్చిన లిక్కర్ కింగ్‌
Follow us on

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఉచ్చు బిగుస్తోంది. దేశంలోని పలు బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టి.. విదేశాలకు జారుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న ఆయనను.. ఇక త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం ఆయన్ను భారత్‌కు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తప్పించుకుని తిరిగేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. దీంతో విజయ్ మాల్యా తన స్వరాన్ని మార్చేశాడు. బ్యాంకుల కన్సోర్టియంతో వివాదాలను పరిష్కరించుకునేందుకు సెటిల్మెంట్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మాల్యా తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు మాల్యా సెటిల్మంట్‌ ఆఫర్ ప్యాకేజీ ఎంతో న్యాయవాది కోర్టుకు వెల్లడించలేదు. అయితే అసలు రుణాలు, వాటిపై ఇప్పటి వరకు అయిన వడ్డీ కలిపి.. బ్యాంకులన్నింటికీ.. రూ. 13,960 కోట్లు చెల్లించేందుకు మాల్యా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.