యూపీ సీఎం ఇంట విషాదం.. యోగీ ఆదిత్యనాథ్ తండ్రి కన్నుమూత

| Edited By:

Apr 20, 2020 | 12:36 PM

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇంట విషాదం. ఆయన తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ పరమపదించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన్ను పరీక్షించి.. ఆరోగ్యం విషమిస్తుండటంతో..వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ప్రాణాలు విడిచారు. గతకొద్ది రోజులుగా ఆయన కిడ్నీ, కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తీవ్రఅనారోగ్యానికి గురికావడంతో.. ఆయన్ను గత నెల మార్చి 13 వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించినట్లు […]

యూపీ సీఎం ఇంట విషాదం.. యోగీ ఆదిత్యనాథ్ తండ్రి కన్నుమూత
Follow us on

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇంట విషాదం. ఆయన తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ పరమపదించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన్ను పరీక్షించి.. ఆరోగ్యం విషమిస్తుండటంతో..వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ప్రాణాలు విడిచారు. గతకొద్ది రోజులుగా ఆయన కిడ్నీ, కాలేయ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తీవ్రఅనారోగ్యానికి గురికావడంతో.. ఆయన్ను గత నెల మార్చి 13 వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించినట్లు తెలుస్తోంది. కాగా.. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్.. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని యమకేశ్వర్‌లోని పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు. 1991లో ఉత్తరాఖండ్‌లో ఫారెస్ట్ రేంజర్‌గా ఉద్యగం నుంచి పదవీ విరమణ చేశారు. అప్పటి నుండి ఆయన స్వగ్రామంలోనే నివసిస్తున్నారు.