అయోధ్యకు సీఎం యోగీ.. భూమి పూజ ఏర్పాట్లు పరీశీలన..

| Edited By:

Jul 25, 2020 | 10:10 AM

యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ శనివారం మధ్యాహ్నం అయోధ్యలో పర్యటించనున్నారు. ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ జన్మభూమిలో "భూమి పూజ" జరగనుంది. ఈ విషయాన్ని..

అయోధ్యకు సీఎం యోగీ.. భూమి పూజ ఏర్పాట్లు పరీశీలన..
Follow us on

యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ శనివారం మధ్యాహ్నం అయోధ్యలో పర్యటించనున్నారు. ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ జన్మభూమిలో “భూమి పూజ” జరగనుంది. ఈ విషయాన్ని శ్రీ రామజన్మ భూమి ఆలయ తీర్ధ ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్‌ దాస్ తెలిపిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతో పాటుగా.. అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పలికామన్నారు. ఈ క్రమంలో భూమి పూజకు సంబంధించిన జరుగుతున్న పనుల తీరును పరిశీలించేందుకు సీఎం యోగీ శనివారం అయోధ్యలోపర్యటించనున్నారు.

కాగా, ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కీలక నేతలు కూడా హాజరుకానున్నారు.