మహా సీఎం ఇంట్లో విషాదం…కన్నుమూసిన “సామ్నా” ఎడిటర్

|

Jun 15, 2020 | 9:39 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇంట విషాదం చోటుచేసుకుంది. సీఎం మామ, శివసేన అధికారిక పత్రిక సామ్నా ఎడిటర్ మాధవ్ పాటంకర్ మృతి చెందారు.  కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పాటంకర్ ముంబైలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పాటంకర్ కొద్ది రోజులుగా కిడ్నీ సమస్య సహా వివిధ రకాల అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అంధేరిలోని ఓ ఆసుపత్రిలో చేరారు.  ఆదివారం రోజున మృతి చెందిన పాటంకర్ భౌతికకాయానికి ఈరోజు అంత్యక్రియలు […]

మహా సీఎం ఇంట్లో విషాదం...కన్నుమూసిన సామ్నా ఎడిటర్
Follow us on

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇంట విషాదం చోటుచేసుకుంది. సీఎం మామ, శివసేన అధికారిక పత్రిక సామ్నా ఎడిటర్ మాధవ్ పాటంకర్ మృతి చెందారు.  కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పాటంకర్ ముంబైలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పాటంకర్ కొద్ది రోజులుగా కిడ్నీ సమస్య సహా వివిధ రకాల అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అంధేరిలోని ఓ ఆసుపత్రిలో చేరారు.  ఆదివారం రోజున మృతి చెందిన పాటంకర్ భౌతికకాయానికి ఈరోజు అంత్యక్రియలు నిర్వహించారు.

ముంబైలోని బాంద్రాలో థాకరే ఇంటికి సమీపంలోనే మాధవ్ పాటంకర్ ఇల్లు కూడా ఉంది. మాధవ్ పాటంకర్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి సంతాపం వ్యక్తం చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీ సంతాపం తెలిపాయి.