కుల్గాంలో కాల్పుల మోత.. ఇద్దరు ముష్కరులు హతం

| Edited By:

May 30, 2020 | 11:20 AM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని దేశాలు ఇప్పుడు ఈ వైరస్‌తో యుద్ధం చేస్తున్నాయి. కానీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం.. నిత్యం దేశంలో  అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి ప్లాన్లను సైన్యం ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. తాజాగా కుల్గాం జిల్లాలోని వాన్‌పొరా ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటటనలో.. ఇద్దరు […]

కుల్గాంలో కాల్పుల మోత.. ఇద్దరు ముష్కరులు హతం
Follow us on

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని దేశాలు ఇప్పుడు ఈ వైరస్‌తో యుద్ధం చేస్తున్నాయి. కానీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం.. నిత్యం దేశంలో  అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి ప్లాన్లను సైన్యం ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. తాజాగా కుల్గాం జిల్లాలోని వాన్‌పొరా ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటటనలో.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో.. సైన్యం కూంబింగ్ చేపడుతుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం.. ఎదురుకాల్పులకు దిగింది. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేపడుతున్నారు.