ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్ ప్రాంతంలోని కిమాడి-మస్సూరి ప్రాంతంలో ఓ కారు లోయలో పడింది. దీంతో కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో భార్యభర్త మృతి చెందగా.. వారి కుతూరు, డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులిద్దరినీ నీజర్ త్యాగి,షగున్ త్యాగిగా గుర్తించారు. మృతులిద్దరు బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీకి సమీప బంధువులని సమాచారం. ఈ విషయాన్ని డెహ్రాడూన్ పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే.. రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ ఆరుషిని, కారు డ్రైవర్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.