వరుడి ఇంట్లో టాయిలెట్ ఉంటే.. వధువుకి బంపర్ ఆఫర్..!

| Edited By:

Oct 11, 2019 | 12:14 PM

స్వచ్చ భారత్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీలో షాదీ ముబారక్ తరహాలో అక్కడ కూడా ఓ స్కీమ్ తీసుకొచ్చింది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత అమ్మాయి.. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లడం ఆనవాయితీ. స్వచ్ఛ భారత్‌లో భాగంగా పెళ్లి చేసుకునే వరుడు.. తన ఇంట్లోని టాయిలెట్ వద్ద నిలబడి సెల్ఫీ పంపించాలని ఇప్పటి నుంచి ఈ ఆచారాన్ని అందరూ పాటించాలని భోపాల్ […]

వరుడి ఇంట్లో టాయిలెట్ ఉంటే.. వధువుకి బంపర్ ఆఫర్..!
Follow us on

స్వచ్చ భారత్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీలో షాదీ ముబారక్ తరహాలో అక్కడ కూడా ఓ స్కీమ్ తీసుకొచ్చింది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత అమ్మాయి.. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లడం ఆనవాయితీ. స్వచ్ఛ భారత్‌లో భాగంగా పెళ్లి చేసుకునే వరుడు.. తన ఇంట్లోని టాయిలెట్ వద్ద నిలబడి సెల్ఫీ పంపించాలని ఇప్పటి నుంచి ఈ ఆచారాన్ని అందరూ పాటించాలని భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. భోపాల్‌లోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం పాటించాలని చెప్పారు. పెళ్లికి ముందు వరుడి ఇంట్లో టాయిలెట్ ఉందని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు.

పథకం ప్రకారం, పాలసీలో సడలింపు ఉండేది. వధూవరులకు వారి వివాహానికి ముందు టాయిలెట్ నిర్మించడానికి 30 రోజుల సమయం ఇచ్చేవారు. తాజాగా దానిని తొలగిస్తూ.. కొత్త పాలసీని అమలులోకి తీసుకొచ్చారు. టాయిలెట్‌తో ఉన్న వరుడి ఫోటోను.. పెళ్లికి ముందు చూపించడంలో తప్పు లేదని.. ఇప్పటి నుంచి ఈ పాలసీని ప్రతి ఒక్కరూ అమలు చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు రఫీక్ ఖురేషి తెలిపారు. ఇది స్వచ్ఛ భారత్‌లో భాగమని చెప్పారు. ఎవరైతే పెళ్లికి ముందే తమ అత్తవారింట్లో టాయిలెట్ ఉందని నిరూపిస్తారో వారికి ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 18న అధికారంలోకి వచ్చిన రెండో రోజే.. ఈ పాలసీలో అప్పటి వరకు ఉన్న ఆర్టిక సహాయాన్ని రూ.28 వేల నుంచి రూ.51 వేలకు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో వేలకు పైగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ప్రతి ఇంటిని టాయిలెట్ కోసం అంచనా వేయడం అధికారులకు కష్టతరంగా మారింది. అందుకే కొత్త రూల్‌ను తీసుకొచ్చారు.