డ్రాగన్ కంట్రీకి భారత ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. టిక్టాక్ సహా 59 చైనా యాప్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను తాజాగా విడుదల చేసింది. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఈ యాప్లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యాప్ల ద్వారా భారత్ నుంచి రకరకాల సమాచారం సేకరిస్తున్నాయంటూ చైనాకు భారత్ ఎన్ని విఙ్ఞప్తులు చేసినా డ్రాగన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా యాప్లను నిషేదించాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
బ్యాన్ అయిన చైనా యాప్లు ఇవే: