ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

| Edited By:

Aug 12, 2020 | 8:27 PM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు ఆర్ధికంగా సహకారం చేస్తున్న వారిపై కూడా పోలీసులు, భద్రతా బలగాలు ఓ కన్నేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న..

ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
Follow us on

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు ఆర్ధికంగా సహకారం చేస్తున్న వారిపై కూడా పోలీసులు, భద్రతా బలగాలు ఓ కన్నేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వారి కదలికలపై కన్నేసి.. బుధవారం ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు ఉత్తర కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులు చేరేవేస్తూ.. వారితో కలిసి ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించారు. వీరికి ఇంత పెద్ద ఎత్తున నగదు ఎక్కడి నుంచి వస్తుందన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితులు ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే