జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. నౌషేరా సెక్టార్లో సరిహద్దలు దాటి చొరబాటుకు విశ్వ ప్రయత్నాలుచేశాయి. వారి ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టింది. దీంతో సైన్యంపైకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడ్డారు. వారి కాల్పులకు గట్టి సమాదానం చెప్పింది సైన్యం. సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరింత మంది టెర్రరిస్టులు సరిహద్దుల వెంట నక్కి ఉన్నారేమోనని సైన్యం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది.
పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల నుంచి చొరబడేందుకు ప్రయాత్నించారు. ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు లభించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఎల్ఓసీ వెంట పీఓకేలో 15 లాంచ్ ప్యాడ్ల వద్ద ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ వేసవిలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు పెరిగాయని, వాటిని సమర్ధంగా తిప్పికొట్టి, ముష్కరులను మట్టుబెట్టినట్టు వివరించారు.