బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయి..! జగన్ సర్కార్‌పై సంచలన కామెంట్ చేసిన టీడీపీ ఎంపీ

| Edited By: Srinu

Feb 01, 2020 | 4:53 PM

బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు మొండిచెయ్యే ఎదురైందన్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఏపీ ప్రజలను అటు కేంద్ర ప్రభుత్వం .. రాష్ట్రంలో వైసీపీ మోసం చేశాయని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైసీపీ.. ఇప్పుడు బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తోందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం సహా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును వైసీపీ సమర్థిస్తూ వస్తుందన్నారు. అయినా కూడా కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా కూడా ఏపీ […]

బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయి..! జగన్ సర్కార్‌పై సంచలన కామెంట్ చేసిన టీడీపీ ఎంపీ
Follow us on

బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు మొండిచెయ్యే ఎదురైందన్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఏపీ ప్రజలను అటు కేంద్ర ప్రభుత్వం .. రాష్ట్రంలో వైసీపీ మోసం చేశాయని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైసీపీ.. ఇప్పుడు బీజేపీకి బీ-టీమ్‌గా వ్యవహరిస్తోందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం సహా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును వైసీపీ సమర్థిస్తూ వస్తుందన్నారు. అయినా కూడా కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా కూడా ఏపీ ప్రస్తావన రాలేదన్నారు.