అయోధ్య రామ మందిర నిర్మాణంపై శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు

| Edited By:

Jul 20, 2020 | 5:46 AM

అయోధ్య రామ మందిర నిర్మాణంపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో శరద్ పవార్..

అయోధ్య రామ మందిర నిర్మాణంపై శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు
Follow us on

అయోధ్య రామ మందిర నిర్మాణంపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో శరద్ పవార్ పరోక్షంగా స్పందించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టేందుకు యుద్ధం చేస్తున్నామని.. అయితే కొందరు వ్యక్తులు మాత్రం ఆలయ నిర్మాణాలు చేపట్టడం ద్వారా కరోనా మహమ్మారిని నిర్మూలించవచ్చనే భావనతో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బీజేపీపై పరోక్షంగా చేశారని తెలుస్తోంది. ఆదివారం నాడు షోలాపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేశారు.