మందిర భూమిపూజకు “ఆర్‌ఎస్ఎస్” మట్టి,నీరు..!

| Edited By:

Jul 25, 2020 | 11:03 AM

రామాలయ భూమిపూజ కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ మట్టి, నీరును పంపింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంగా భావించే నాగ్‌పూర్‌ నుంచి అయోధ్యకు మట్టిని పంపినట్లు విశ్వ హిందూ పరిషత్ నేత..

మందిర భూమిపూజకు ఆర్‌ఎస్ఎస్ మట్టి,నీరు..!
Follow us on

రామాలయ భూమిపూజ కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ మట్టి, నీరును పంపింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంగా భావించే నాగ్‌పూర్‌ నుంచి అయోధ్యకు మట్టిని పంపినట్లు విశ్వ హిందూ పరిషత్ నేత వెల్లడించారు. నాగ్‌పూర్‌కు సమీపంలో ఉండే రాంటెక్‌లోని ఆలయం నుంచి మట్టిని, అలాగే సమీపంలోని ఐదు నదుల సంగమ క్షేత్రం నుంచి నీటిని సేకరించి అయోధ్యకు పంపినట్లు తెలుస్తోంది. తొలుత.. దేశంలోని పలు ప్రాంతాల నుంచి మట్టిని, నీరును సేకరించి రామ జన్మభూమి పూజా కార్యక్రమం నిర్వహించాలనుకున్నామని.. అయితే ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా కొన్ని ప్రాంతాల నుంచి మాత్రమే సేకిరిస్తున్నట్లు తెలిపారు. కాగా, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మట్టిని, నీరును అయోధ్యకు పంపిస్తున్నారు.