సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తోన్న “మహా” సర్కార్..!.. “మోదీ”కి చెక్ పెట్టేందుకేనా..?

| Edited By:

Feb 13, 2020 | 3:03 AM

మహారాష్ట్రలో అనూహ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్దవ్ థాక్రే.. పలు కీలక నిర్ణాయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పది రూపాయలకే పేదలకు భోజన పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇక తాజాగా మరిన్ని సంచనల నిర్ణయాలు తీసుకున్నారు సీఎం ఉద్దవ్ థాక్రే. అయితే ఈయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే.. దేశభక్తికి కేరాఫ్ అని చెప్పుకునే బీజేపీ సర్కార్‌కు చెక్ పెట్టేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. రాష్ట్రంలో మరాఠా […]

సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తోన్న మహా సర్కార్..!.. మోదీకి చెక్ పెట్టేందుకేనా..?
Follow us on

మహారాష్ట్రలో అనూహ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్దవ్ థాక్రే.. పలు కీలక నిర్ణాయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పది రూపాయలకే పేదలకు భోజన పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇక తాజాగా మరిన్ని సంచనల నిర్ణయాలు తీసుకున్నారు సీఎం ఉద్దవ్ థాక్రే. అయితే ఈయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే.. దేశభక్తికి కేరాఫ్ అని చెప్పుకునే బీజేపీ సర్కార్‌కు చెక్ పెట్టేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. రాష్ట్రంలో మరాఠా వాదాన్ని చూపుతూ.. ప్రజల్ని ఆకర్షించేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మరాఠి భాషను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో.. అన్ని కళాశాలల్లో నిత్యం జాతీయగీతాలాపన తప్పనిసరి చేస్తూ.. కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ నెల ఫిబ్రవరి 19న శివాజీ జయంతి సందర్భంగా ఈ ఆదేశాలు అమలులోకి రానున్నాయి. ఇక నుంచి ప్రతి రోజూ ఉదయం అన్ని కాలేజీల్లో తరగతులు ప్రారంభించటానికి ముందు.. జాతీయ గీతం ఆలాపించేలా ఆదేశాలు జారీ చేసినట్లు ఆ రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామంత్ తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను.. ఫిబ్రవరి 19 వరకు అన్ని కాలేజీలకు పంపనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. ఈ నియమాన్ని పాటించేందుకు కాలేజీలు కూడా రెడీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో నిత్యం రాష్ట్రంలోని 15 లక్షల మంది కళాశాల విధ్యార్ధులు జాతీయ గీతాలాపన చేయనున్నారని.. ఇది దేశంలోనే రికార్డు కాబోతుందన్నారు. ఇప్పటి వరకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో దేశ భక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.

మరోవైపు ప్రభుత్వోద్యుగులకు కూడ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇక నుంచి వారానికి ఐదు రోజులే పనిదినాలని తెలిపింది. వారానికి రెండు రోజులు సెలవులను ప్రకటించింది. ఫిబ్రవరి 29 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ముంబైలో సీఎం ఉద్దవ్ థాక్రే నేతృత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈనిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వోద్యుగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.