భారీ వర్షానికి విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి

| Edited By:

Jul 17, 2020 | 4:18 AM

షిమ్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంతేకాదు.. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా గురువారం నాడు.. షిమ్లాలోని ఓల్డ్ బారియర్ రోడ్డు సమీపంలోని ఓ ప్రాంతంలో..

భారీ వర్షానికి విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి
Follow us on

షిమ్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంతేకాదు.. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా గురువారం నాడు.. షిమ్లాలోని ఓల్డ్ బారియర్ రోడ్డు సమీపంలోని ఓ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం దాటికి.. రోడ్డు పక్క భాగంలో ఉన్న కొండచరియలు విరిగిపడ్డట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ కొండ కింద ముగ్గురు వ్యక్తులు ఓ షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలోనే అందులో ఉన్న ఓ 48 ఏళ్ల వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. కాగా, సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఐజీఎంసీ ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనపై ఐసీపీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.