కరోనా వైరస్ కారణంగా సైలెంట్గా ఉన్న మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. ఝార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్లో సీఆర్పీఎఫ్ క్యాంప్పై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళా మావోయిస్టు సహా ముగ్గురు హతమయ్యారు. అలాగే మరో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
మన్మారు-టెబో అటవి ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు ఈ తెల్లవారుజామున (మే28) మెరుపు దాడికి పాల్పడగా.. దీనిని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో వారి నుంచి ఏకే 47, ఓ రైఫిల్, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ అధికారులు వివరించారు.