ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

| Edited By:

Oct 17, 2020 | 9:09 AM

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిలిబిత్‌, ఖుషీనగర్‌ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Follow us on

Uttar Pradesh road accident: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిలిబిత్‌, ఖుషీనగర్‌ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప జిల్లా ఆసుపత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పిలిభిత్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ జై ప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది, బొలెరోలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమయంలో బొలెరో డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,451 కొత్త కేసులు.. 9 మరణాలు

Bigg Boss 4: మూడో ‘ఏ’తో మోనాల్‌ రొమాన్స్‌