మీరు పార్టీ పెడితే మీ బాటలోనే నడుస్తాం లేదంటే.. రజనీకాంత్‌కి స్పష్టం చేసిన అభిమానులు

| Edited By:

Nov 30, 2020 | 11:06 AM

చెన్నైలో అభిమానులతో రజనీకాంత్ మక్కల్ మండ్రమ్ సమావేశం వాడావేడీగా జరిగింది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌కి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిన అభిమాన సంఘాల నేతలు

మీరు పార్టీ పెడితే మీ బాటలోనే నడుస్తాం లేదంటే.. రజనీకాంత్‌కి స్పష్టం చేసిన అభిమానులు
Follow us on

Rajini Makkal Mandram : చెన్నైలో అభిమానులతో రజనీకాంత్ మక్కల్ మండ్రమ్ సమావేశం వాడావేడీగా జరిగింది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌కి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిన అభిమాన సంఘాల నేతలు.. ఉద్వేగానికి గురయ్యారు. ”పార్టీ పెడితే మేము మీ బాటలో నడుస్తామని, మీ గెలుపు కోసం పనిచేస్తామని” అభిమానులు వెల్లడించారు. అయితే మద్దతు ఇస్తే ఏ పార్టీకి ఓటు వేసేది లేదని వారు తేల్చారు. ఈ సందర్భంగా సభలో బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రజనీకాంత్ అభిమానులకు సర్దిచెప్పారు.

కాగా తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో జోరును పెంచాయి. మరోవైపు తమిళనాట ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోన్న బీజేపీ.. సినీ ప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా తన మద్దతును బీజేపీకి చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులతో ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీకి మద్దతును ఒప్పుకోమని, మీరే రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరారు. మరి ఇప్పటికైనా సూపర్‌స్టార్ రాజకీయాలపై ఓ స్పష్టతను ఇస్తారేమో చూడాలి.