PM Modi in ISRO, Bengaluru Highlights: భారత కీర్తి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప ప్రయోగం.. చంద్రయాన్ సూపర్ సక్సెస్ అయింది. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి ఫలించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. నింగికేగిన చంద్రయాన్ – 3 భారత కీర్తి పతాకను దశదిశలా చాటింది. ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇస్రోపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే, విదేశీ పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ ఇవాళ.. నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను కలిసి వారిని అభినందించనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ఏథెన్స్ నుంచి నేరుగా బెంగళూరు చేరుకున్న ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఇస్రో కార్యాలయానికి వెళ్లి చంద్రయాన్-3 బృందంలోని శాస్త్రవేత్తలతో మాట్లాడనున్నారు. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇస్రో స్టేషన్ల నుంచి చంద్రయాన్ 3 శాస్త్రవేత్తలు బెంగళూరు ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
అంతరిక్షరంగంలో చంద్రయాన్-3 సరికొత్త చరిత్రను లఖించిందని.. ప్రపంచంలోనే భారత్ అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని ప్రధాని తెలిపారు.
#WATCH | …”Experts say that in a few years, India’s space industry will become $16 billion from $8 billion…”: PM Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/uOWqY2cREF
— ANI (@ANI) August 26, 2023
అనంత విశ్వంలో ప్రజ్ఞాన్ రోవర్ శంఖానదం పూరించిందని ప్రధాని పేర్కొన్నారు. చంద్రయాన్2 లునార్ ల్యాండింగ్ ప్రదేశానికి తిరంగాగా పిలువనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
చంద్రయాన్-3 యువతకు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోడీ తెలిపారు. చంద్రయాన్2 వైఫల్యంతో వెనకడుగు వేయలేదని.. రెట్టింపైన ఉత్సహాంతో పనిచేశారంటూ ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.
అంతరిక్షరంగంలో చంద్రయాన్-3 బెంచ్మార్క్ను నెలకొల్పిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆగస్టు 23న ఏటా నేషనల్ స్పేస్ డే జరుపుకోనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.
ప్రతీ ఇంటిపైనే కాదు.. చంద్రునిపై కూడా త్రివర్ణ పతాకం ఎగురుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. చంద్రయాన్-3 ప్రయోగంలో మహిళా శక్తి పాత్ర ఎంతో ఉందని తెలిపారు.
చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ‘శివశక్తి’గా పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 23 ఆగస్టు నా కళ్ల ముందు ఇప్పటికీ తచ్ఛాడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
The spot where Chandrayaan-3’s moon lander landed, that point will be known as ‘Shivshakti’, announces Prime Minister Narendra Modi pic.twitter.com/L9f9OmATbU
— ANI (@ANI) August 26, 2023
అంతరిక్ష చరిత్రలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని ప్రధని మోడీ పేర్కొన్నారు. ఇస్రో సాధించింది.. మామూలు విజయం కాదని.. దేశం మొత్తం గర్విస్తుందంటూ పేర్కొన్నారు.
#WATCH | Bengaluru: I wanted to meet you as soon as possible and salute you…salute your efforts…”: PM Modi gets emotional while addressing the ISRO scientists pic.twitter.com/R2BsyyPiNc
— ANI (@ANI) August 26, 2023
బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్కు శుభాకాంక్షలు తెలిపారు.
#WATCH | Bengaluru: Prime Minister Narendra Modi meets ISRO chief S Somanath and congratulates him for the successful landing of Chandrayaan-3 on the Moon pic.twitter.com/J8cRsftwv2
— ANI (@ANI) August 26, 2023
చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నానని.. కానీ మనసంతా ఇక్కడే ఉందంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.. ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తుందన్నారు.
చంద్రయాన్-3 మిషన్లో పాల్గొన్న ఇస్రో బృందంలోని శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు.
చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘నేను దేశంలో లేనందున నన్ను నేను ఆపుకోలేకపోయాను.. భారత్ కు వెళ్లగానే నేను మొదట బెంగళూరు సందర్శించి, మన శాస్త్రవేత్తలను కలవాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు.
#WATCH | Bengaluru, Karnataka | PM Narendra Modi says “I could not stop myself as I was not in the country, but I decided to visit Bengaluru first and meet our scientists right after visiting India.” pic.twitter.com/fylaqqSftd
— ANI (@ANI) August 26, 2023
బెంగళూరు విమానాశ్రయంలో ప్రధాని మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘జై విజ్ఞాన్ జై అనుబంధ్’ నినాదం గురించి ప్రస్తావించారు.
#WATCH | Karnataka | Prime Minister Narendra Modi raises the slogan ‘Jai Vigyan Jai Anusandhan’ outside HAL airport in Bengaluru.
PM Modi will shortly meet scientists of the ISRO team involved in Chandrayaan-3 Mission. pic.twitter.com/1FHiz9or4h
— ANI (@ANI) August 26, 2023
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) -శ్రీహరికోట, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)-తిరువనంతపురం, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC)-అహ్మదాబాద్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ తిరువనంతపురం సహా 18 ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తల బృందం బెంగళూరు చేరుకుంది. ఇస్రో చీఫ్, మిషన్ డైరెక్టర్లను ప్రధానమంత్రి మోడీ వ్యక్తిగతంగా అభినందించే అవకాశం ఉంది. సెప్టెంబరు 2న ప్రయోగించనున్న ఆదిత్య L-1 మిషన్, గగన్యాన్ గురించి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అంతేకాకుండా ISRO, ISTRAC ల్యాండర్ విక్రమ్, రోవర్ తాజా ఫుటేజిని ప్రధాని పరిశీలించే అవకాశం ఉంది. ఇస్రో హెడ్క్వార్టర్స్లో ప్రధాని పర్యటనను దేశంలోని అన్ని ఇస్రో స్టేషన్లలో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
ప్రధాని మోడీకి బెంగళూరులో ఘనస్వాగతం లభించింది. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం వెలుపల గుమిగూడిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అభివాదం చేశారు.
#WATCH | Karnataka | PM Narendra Modi greets people gathered outside HAL airport in Bengaluru.
PM Modi will meet scientists of the ISRO team involved in Chandrayaan-3 Mission at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex. pic.twitter.com/70owpeWwlF
— ANI (@ANI) August 26, 2023