వాహనదారులకు భారీ షాక్.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

| Edited By:

May 05, 2020 | 8:38 PM

వాహనదారులకు భారీ షాక్‌ ఇస్తోంది ఢిల్లీ సర్కార్. గత 40 నుంచి 50 రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు అకస్మాత్తుగా భారీగా పెరిగాయి.ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ.1.67 పెరిగింది. అటు లీటర్‌ డీజిల్‌పై ఏకంగా రూ.7.10 పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. ఢిల్లీ సర్కార్.. పెట్రోల్‌,డీజిల్‌ ధరలపై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)‌ను పెంచడమే. కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.69.59 […]

వాహనదారులకు భారీ షాక్.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!
Follow us on

వాహనదారులకు భారీ షాక్‌ ఇస్తోంది ఢిల్లీ సర్కార్. గత 40 నుంచి 50 రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు అకస్మాత్తుగా భారీగా పెరిగాయి.ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ.1.67 పెరిగింది. అటు లీటర్‌ డీజిల్‌పై ఏకంగా రూ.7.10 పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. ఢిల్లీ సర్కార్.. పెట్రోల్‌,డీజిల్‌ ధరలపై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)‌ను పెంచడమే.

కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.69.59 నుంచి రూ.71.26కి పెరిగింది. ఇక డీజిల్ ధర కూడా లీటరుకు రూ.62.29 ఉండగా.. పెంచిన వ్యాట్‌తో రూ.69.39కి చేరింది. పెట్రోల్‌,డీజిల్‌పై తాజాగా ముప్పై శాతం వ్యాట్‌ను పెంచింది. ఇంతకు ముందు పెట్రోల్‌పై 27 శాతం ఉండేది. ఇక డీజిల్‌పై 16.75 శాతం
ఉండేది. ప్రస్తుతం ఇటు పెట్రోల్‌, అటు డీజిల్‌ రెండింటిపై ఇప్పుడు ముప్పై శాతంగా అవ్వడంతో.. ధరలు ఇంతలా పెరిగాయి.

కాగా, ఇప్పటికే గత నెలలో అసోం రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ పెంచింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంచే అవకాశం ఉందని అనుకుంటున్నారు.