బిగ్ బాస్ పై సంచలన కామెంట్లు చేసిన ముఖ్యమంత్రి.. ఆ షోను చూడటం వల్ల పిల్లలు పాడైపోతున్నారు..

|

Dec 18, 2020 | 10:06 PM

బిగ్ బాస్ రియాల్టీ షో అన్నీ భాషలో ప్రేక్షకులను అలరిస్తూ సాగుతుంది. తెలుగులో నాగార్జున హోస్ట్ గా సీజన్ 4 కూడా పూర్తికాబోతుంది. ఇక తమిళనాట బిగ్ బాస్ కు హోస్ట్ గా లోకనాయకుడు కమల్ హాసన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ పై సంచలన కామెంట్లు చేసిన ముఖ్యమంత్రి.. ఆ షోను చూడటం వల్ల పిల్లలు పాడైపోతున్నారు..
Follow us on

బిగ్ బాస్ రియాల్టీ షో అన్నీ భాషలో ప్రేక్షకులను అలరిస్తూ సాగుతుంది. తెలుగులో నాగార్జున హోస్ట్ గా సీజన్ 4 కూడా పూర్తికాబోతుంది. ఇక తమిళనాట బిగ్ బాస్ కు హోస్ట్ గా లోకనాయకుడు కమల్ హాసన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమిళనాడు సీఎం కె.పళనిస్వామి బిగ్ బాస్ పైన సంచలన కామెంట్లు చేశారు. పళనిస్వామి మాట్లాడుతూ.. ”కమల్‌హాసన్ డెబ్బై ఏళ్ల వయసులో బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇలాంటి బిగ్‌బాస్ షోను చూడటం వల్ల పిల్లలు పాడైపోతున్నారు. ఇలాంటి షోస్‌ను హోస్ట్ చేయడం వల్ల కుటుంబాలు ఏమీ బాగుపడవు” అన్నారు. అయితే త్వరలో జరగబోయే అసంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. రజినీకాంత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో తమిళరాజకీయం మరింత వేడెక్కింది. కొద్దిరోజుల క్రితం ఐటీ అధికారులు జరిపిన దాడిలో లెక్కకురాని డబ్బు బయటపడింది. దీనిపై కమల్‌హాసన్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ పళని స్వామి ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కమల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ పైన పళనిస్వామి కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.