బ్రేకింగ్.. బార్డర్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం.. అది కూడా ఆయుధాలతో..

| Edited By: Pardhasaradhi Peri

Jun 20, 2020 | 12:47 PM

పాకిస్థాన్‌ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తుంది. నిత్యం బార్డర్‌లో కాల్పులకు దిగుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను భారత్‌లోకి వదిలేందుకు ప్రయత్నించింది.

బ్రేకింగ్.. బార్డర్‌లో పాక్‌ డ్రోన్‌ కలకలం.. అది కూడా ఆయుధాలతో..
Follow us on

పాకిస్థాన్‌ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తుంది. నిత్యం బార్డర్‌లో కాల్పులకు దిగుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్రోన్‌ల ద్వారా ఆయుధాలను భారత్‌లోకి వదిలేందుకు ప్రయత్నించింది. అయితే అవి ఉగ్రవాదులకు అందజేసేందుకా.. లేక ఇంకా వేరే టెక్నాలజీతో డ్రోన్‌తో కాల్పులకు దిగేందుకు యత్నించిందా అన్నది తేలాల్సిఉంది. అయితే భారత భూబాగంలోకి వచ్చిన వెంటనే దాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు నేల కూల్చారు. కథువా ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కథువా జిల్లాలోని హిరా నగర్‌లోని పోస్ట్ వద్ద పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ కనిపించిందని.. వెంటనే దానిని కూల్చేయడం జరిగిందన్నారు. డ్రోన్‌తో పాటు పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని.. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.