పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌

| Edited By:

Aug 06, 2020 | 1:23 AM

పాకిస్థాన్ మళ్లీ తన వక్రబుద్దికి పనిచెప్తోంది. మంగళవారం నాడు.. కొత్త మ్యాప్‌ విడుదల చేసి మరో వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం అలా ఉండగానే.. మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు..

పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌
Follow us on

పాకిస్థాన్ మళ్లీ తన వక్రబుద్దికి పనిచెప్తోంది. మంగళవారం నాడు.. కొత్త మ్యాప్‌ విడుదల చేసి మరో వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం అలా ఉండగానే.. మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. పూంచ్‌ జిల్లాలోని మన్‌కోటే సెక్టార్‌ మీదుగా కాల్పులకు తెగబడింది. బుధవారం రాత్రి 7.00 గంటల ప్రాంతంలో చిన్న ఆయుధాలు, మోర్టార్‌ షెల్స్‌ ప్రయోగిస్తూ కాల్పులకు దిగింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ తెలిపింది. పాక్‌ కాల్పులకు ధీటుగా ఎదురు సమాధానం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, గత కొద్ది రోజులుగా నిత్యం సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు దిగుతోంది. ఈ ఘటనలో పలువురు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు.

 

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు