Vice president: గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు… ప్ర‌జాస్వామ్యం శ‌క్తివంత‌మైన‌ది

| Edited By:

Jan 25, 2021 | 7:33 PM

మన ప్రజాస్వామ్యం ఎంతో శక్తివంతమైనదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. సుపరిపాలన, పారదర్శకత పట్ల మన నిబద్ధత...

Vice president: గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు... ప్ర‌జాస్వామ్యం శ‌క్తివంత‌మైన‌ది
Follow us on

మన ప్రజాస్వామ్యం ఎంతో శక్తివంతమైనదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. సుపరిపాలన, పారదర్శకత పట్ల మన నిబద్ధత గతంలో కంటే బలంగా ఉన్నదని తెలిపారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన నాగరిక ఆదర్శాలు, రాజ్యాంగ విలువలను సమర్థవంతంగా నిలబెట్టేందుకు, సమగ్ర, శాంతియుత, సామరస్యపూర్వక, ప్రగతిశీల భారతదేశాన్ని నిర్మించడానికి మన ప్రతిజ్ఞను పునరుద్ధరించుకుందామని పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మకమైన ఆదర్శాల ఆధారంగా మనం రూపొందించుకున్న రాజ్యాంగం పట్ల, అందులో పొందుపరిచిన అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి గణతంత్ర వ్యవస్థాపక సూత్రాల పట్ల మన నిబద్ధతను తిరిగి చాటుకుందామని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.