గణేష్‌ నిమజ్జనానికి ఐదుగురికే అనుమతి

| Edited By:

Jul 24, 2020 | 3:39 PM

కరోనా వైరస్‌ భారతీయ పండుగలపై ప్రభావాన్ని చూపింది. మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి పండుగను దేశ ప్రజలు ఇళ్లలోనే జరుపుకుంటూ వస్తున్నారు.

గణేష్‌ నిమజ్జనానికి ఐదుగురికే అనుమతి
Follow us on

కరోనా వైరస్‌ భారతీయ పండుగలపై ప్రభావాన్ని చూపింది. మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి పండుగను దేశ ప్రజలు ఇళ్లలోనే జరుపుకుంటూ వస్తున్నారు. ఇక వచ్చే నెలలో రాబోతున్న గణేష్‌ ఉత్సవాలపై కూడా కరోనా ఎఫెక్ట్‌ పడింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో గణేష్‌ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గణేష్‌ ఉత్సవాలకు సంబంధించి కొన్ని నిబంధనలు పెడుతున్నాయి. ఈ క్రమంలో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ గణేష్‌ నిమజ్జనానికి సంబంధించి ముంబయివాసులకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

గణేష్‌ విగ్రహాల ఊరేగింపు మొదలు నిమజ్జనంలో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది. అలాగే మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీఎంసీ హెచ్చరించింది. ముంబయిలో కరోనా కేసులు ఇప్పటికే లక్షను దాటేయడం, కేసులు పెరుగుతూనే ఉండటంతో.. బీఎంసీ(బ్రిహాన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌) ఈ నిర్ణయం తీసుకుంది.