వాహనాలపై విరిగిపడ్డ కొండచరియలు..

| Edited By:

May 17, 2020 | 11:00 AM

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం తాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా పలుచోట్ల విరుచుకుపడుతోంది. పలుచోట్ల భారీ వర్షాలు పడుతుంటే.. ఇంకొన్ని చోట్ల భూకంపాలు భయపెడుతున్నాయి. ఇలా మనదేశంలో కూడా కరోనా వేళ ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్‌ రాంబన్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అటుగా వెళ్తున్న పలు వాహనాలపై పెద్ద పెద్ద రాళ్లు పడ్డాయి. దీంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. […]

వాహనాలపై విరిగిపడ్డ కొండచరియలు..
Follow us on

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం తాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా పలుచోట్ల విరుచుకుపడుతోంది. పలుచోట్ల భారీ వర్షాలు పడుతుంటే.. ఇంకొన్ని చోట్ల భూకంపాలు భయపెడుతున్నాయి. ఇలా మనదేశంలో కూడా కరోనా వేళ ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్‌ రాంబన్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అటుగా వెళ్తున్న పలు వాహనాలపై పెద్ద పెద్ద రాళ్లు పడ్డాయి. దీంతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.