దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచర, హత్య కేసు నిందితులు.. మరోసారి ఉరి శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సారి రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరించడంలో విధానపరమైన లోపం ఉందంటూ హైకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించి వినయ్ శర్మ తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.