నిర్భయ దోషులు జైల్లో ఎంత సంపాదించారంటే..!

| Edited By:

Mar 20, 2020 | 12:13 PM

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. తీహార్ జైల్లో నలుగురు దోషులు ఉరి తాళ్లకు వేలాడారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు ఏడేళ్ల తరువాత నిర్భయకు న్యాయం జరిగిందని అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

నిర్భయ దోషులు జైల్లో ఎంత సంపాదించారంటే..!
Follow us on

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. తీహార్ జైల్లో నలుగురు దోషులు ఉరి తాళ్లకు వేలాడారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు ఏడేళ్ల తరువాత నిర్భయకు న్యాయం జరిగిందని అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ నలుగురికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించి వారి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. అయితే దాదాపు ఏడేళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వీరిలో ముగ్గురు అక్కడ పనులు చేసి కాస్తో కూస్తో డబ్బును సంపాదించారు. ముఖేష్ కుమార్ మాత్రం ఏ పని చేయడానికి ఇష్టపడలేదు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అక్షయ్ ఠాకూర్ రూ.69వేలు, పవన్ గుప్త రూ.29వేలు, వినయ్ శర్మ రూ.39వేలు జైల్లో సంపాదించారు. ఈ డబ్బును జైలు అధికారులు వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.

వినయ్‌ శర్మ 11 సార్లు, అక్షయ్‌ ఒక సారి, ముఖేష్‌ మూడు సార్లు, పవన్‌ ఎనిమిది సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించి.. అందుకు శిక్షలు అనుభవించారు. ఇక 2016లో ముఖేష్‌, పవన్‌, అక్షయ్‌.. పదో తరగతిలో అడ్మిషన్‌ తీసుకున్నప్పటికీ వారు పాస్‌ కాలేదు. ఇక 2015లో వినయ్‌ బ్యాచిలర్‌ డిగ్రీలో అడ్మిషన్‌ తీసుకున్నప్పటికీ.. అది పూర్తి చేయలేదు.