ఇంత దారుణమా.. గుండు గీసి.. ఆ తర్వాత “జై శ్రీరాం” అని రాసి..

| Edited By:

Jul 18, 2020 | 4:18 AM

యూపీలో కొందరు వ్యక్తులు ఇంకా ఆటవిక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఓ వైపు దేశం డిజిటల్‌గా దూసుకెళ్తున్నప్పటికీ.. కొందరు మూర్ఖులు చేస్తున్న పనులతో దేశం పరువునే తీసేస్తున్నారు. అందుకు..

ఇంత దారుణమా.. గుండు గీసి.. ఆ తర్వాత జై శ్రీరాం అని రాసి..
Follow us on

యూపీలో కొందరు వ్యక్తులు ఇంకా ఆటవిక చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఓ వైపు దేశం డిజిటల్‌గా దూసుకెళ్తున్నప్పటికీ.. కొందరు మూర్ఖులు చేస్తున్న పనులతో దేశం పరువునే తీసేస్తున్నారు. అందుకు ఇటీవల యూపీలో జరిగిన ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల నేపాల్ ప్రధాని రాముడు మా నేపాలీ అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలను యావత్ భారతం ఖండించింది. ఆ తర్వాత నేపాలీ ప్రధాని వ్యాఖ్యలపై ఆ దేశం వివరణ కూడా ఇచ్చింది. ఇదంతా ఇలావుంటే.. నేపాల్ ప్రధాని అలా రాముడి గురించి అలా వ్యాఖ్యానిస్తారా..? అంటూ అక్కడి ఓ హిందూ సంస్థకు చెందిన నాయకుడు ఒకరు యూపీలో నివసిస్తున్న నేపాలీ వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నేపాల్ ప్రధాని ఓలీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నేపాలీ వ్యక్తికి గుండు గీయించాడు. అంతేకాదు.. అతడి గుండుపై మార్కర్‌ పెన్నుతో జై శ్రీ రాం అని రాయించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో
విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఏకంగా ఈ ఘటనపై భారత్‌లోని నేపాల్ రాయబారి నీలాంబర్ ఆచార్య విషయాన్ని యూపీ సీఎం యోగీకు తెలిపారు. దీనిపై స్పందించిన యోగీ.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.