Viral: ఆస్ట్రేలియాకు పార్శిల్ చేయాల్సిన వాటర్ ప్యూరిఫైయర్.. ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్‌కు గురైన అధికారులు

|

Jun 13, 2022 | 10:06 AM

డ్రగ్స్ రవాణా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అయినా కానీ.. డ్రగ్ పెడ్లర్స్ తగ్గేదే లే అంటున్నారు. కేసులు పెట్టి.. జైల్లో పెట్టినా.. మా దందా వదలం అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు.

Viral: ఆస్ట్రేలియాకు పార్శిల్ చేయాల్సిన వాటర్ ప్యూరిఫైయర్..  ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్‌కు గురైన అధికారులు
Drugs Seized
Follow us on

మత్తు నుంచి యువతను రక్షించేందకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గట్టిగా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారిని.. రిహాబిలిటేషన్ సెంటర్స్‌కు తరలిస్తున్నారు. డ్రగ్స్ రవాణా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  అయినా కానీ.. డ్రగ్ పెడ్లర్స్ తగ్గేదే లే అంటున్నారు. కేసులు పెట్టి..  జైల్లో పెట్టినా.. మా దందా వదలం అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. చిప్పకూడు తిని వచ్చినా సరే.. మళ్లీ డ్రగ్స్‌తో గబ్బు వ్యాపారం చేస్తునే ఉన్నారు. రకరకాల డ్రగ్స్ దేశంలోని వివిధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తూ.. యువత భవిష్యత్‌ను చిత్తు చేస్తున్నారు అక్రమార్కులు. ఇందు కోసం చాలా క్రియేటివ్‌గా థింక్ చేస్తున్నారు. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు.. కొత్త కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర(Maharashtra)లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. ఈ మధ్య కాలంలో వరుసగా మత్తు మందు పట్టుబడుతోంది. ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వోల్టమీటర్ & ఇండస్ట్రియల్ నట్ బోల్ట్‌లలో దాచిన 490 గ్రాముల మెథాంఫేటమిన్ డ్రగ్, & 435 గ్రాముల యాంఫెటమైన్ డ్రగ్‌ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో నవీ ముంబై(Navi Mumbai)కి చెందిన 1 వ్యక్తి పట్టుకుంది ముంబై NCB.

మరో కేసులో విదేశాలకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇందుకోసం వారు మాస్టర్ స్కెచ్ వేశారు. వాటర్ ప్యూరిఫైయర్ లోపల తయారు చేసిన ప్రత్యేక అరను ఏర్పాటు చేసి.. అందులో డ్రగ్స్ దాచి ఉంచారు. అనంతరం దాన్ని ఆస్ట్రేలియాకు తరలించే యత్నం చేశారు. కానీ కొరియన్ ఏజెన్సీకి అనుమానం రావడంతో ముంబై  NCBని ఆశ్రయించింది. వారు వచ్చి తనిఖీలు చేయగా.. అసలు బాగోతం బయటపడింది. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..