ముంబై చేరుకున్న డ్రైవర్‌లెస్ ట్రయిన్.. రెండు మార్గాల్లో పరుగులు పెట్టించేందుకు ఏర్పాట్లుః మంత్రి షిండే

|

Jan 27, 2021 | 1:51 PM

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి డ్రైవరు రహిత రైలు పట్టాలెక్కేందుకు ఇవాళ ముంబైకి చేరుకుంది.

ముంబై చేరుకున్న డ్రైవర్‌లెస్ ట్రయిన్.. రెండు మార్గాల్లో పరుగులు పెట్టించేందుకు ఏర్పాట్లుః మంత్రి షిండే
Follow us on

Mumbai driverless train : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి డ్రైవరు రహిత రైలు పట్టాలెక్కేందుకు ఇవాళ ముంబైకి చేరుకుంది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. ముంబై మెట్రోలో మొదటి సారి డ్రైవరులెస్ రైలును బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్సు లిమిటెడ్ తయారు చేసిందని ఆయన తెలిపారు. ఆటోమేటిక్ రైళ్లలో మొదటి డ్రైవరు లెస్ మెట్రోరైలును ముంబైలోని చార్కోప్ మెట్రో కారిడారులో పరుగులు పెట్టనుంది.

డ్రైవరు లేని మెట్రోరైలు ముంబైలోని రెండు మార్గాల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే నెల నుంచి పట్టాలపై పరుగులు పెట్టనున్నట్లు మంత్రి షిండే వెల్లడించారు. ప్రారంభంలో సురక్షితంగా ఉందా లేదా అనేది పరిశీలించేందుకు ఈ రైలును ఆరునెలలపాటు ఓ డ్రైవరు నడుపుతారని, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈ మెట్రోరైలు నడుస్తుందని మంత్రి షిండే చెప్పారు. డ్రైవరు లేని మెట్రోరైళ్లు దహిసార్ నుంచి డిఎన్ నగర్ , దహిసార్ నుంచి అంధేరి ఈస్ట్ వరకు నడుపనున్నారు. ప్రతీ బోగిలో 52మంది చొప్పున మొత్తం 2,280 మంది ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. రాబోయే ఆరునెలల్లో ఆరు డ్రైవరు లేని మెట్రోరైళ్లను నడపాలని నిర్ణయించామని మంత్రి షిండే వివరించారు.

Read Also.. ఎర్రకోట వద్ద చిక్కుబడిపోయిన పిల్లలు, కళాకారులను రక్షించిన పోలీసులు, 2 గంటలపాటు భయం, భయం