ఇండియాలో ఈ సంవత్సరం ఎక్కువగా చర్చకు వచ్చిన విషయాలు, ట్వీట్లు, రీ ట్వీట్లు, హాష్ట్యాగుల వివరాలను ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్వటిర్ ఇండియా వెల్లడించింది. ఇందులో ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఓ ట్వీట్కు అధ్యధిక మంది రీ ట్వీట్ చేసినట్లు ఆ సంస్థ ఎండీ మనీష్ మహేశ్వరీ తెలిపింది. తర్వాత కరోనాకు సంబంధించిన విషయాలపైనే ఎక్కువగా చర్చించినట్లు వివరించింది.
కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 5న ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరు దీపాలను వెలిగించాలని చెప్పిన ట్వీట్కు అత్యధికంగా రీ ట్వీట్లు వచ్చాయి. ఈ ట్వీట్ పాలిటిక్స్ విభాగంలో మోస్ట్ రీట్వీటెడ్ ట్వీట్ ఇన్ పాలిటిక్స్గా నిలిచింది. తర్వాతి స్థానంలో బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం, యూపీలోని హాథ్రస్ దళిత యువతి హత్యాచారం సంఘటనలు నిలిచాయి. వ్యాపారవేత్తల విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా బాధపడుతున్న వ్యక్తులకు అండగా నిలిచేందుకు రతన్ టాటా రూ.500 కోట్లు విరాళం అందించిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్కు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆయనకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.