చమురు బావిలో పేలుడు.. ముగ్గురికి గాయాలు..

| Edited By:

Jul 22, 2020 | 6:41 PM

అసోంలోని చమురు బావిలో మరోసారి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. టిన్సుకియా జిల్లాలోని బాగ్జన్‌ ప్రాంతంలోని ఆయిల్ ఇండియాకు చెందిన ఐదో నెంబర్ బావి వద్ద పేలుడు..

చమురు బావిలో పేలుడు.. ముగ్గురికి గాయాలు..
Follow us on

అసోంలోని చమురు బావిలో మరోసారి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. టిన్సుకియా జిల్లాలోని బాగ్జన్‌ ప్రాంతంలోని ఆయిల్ ఇండియాకు చెందిన ఐదో నెంబర్ బావి వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటన బుధవారం నాడు మధ్యాహ్నం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి అక్కడే ఉన్న ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడ్డారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయిల్ ఇండియా సంస్థ అధికారులు తెలిపారు. ఇక పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగడంతో.. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.