Chhattisgarh Maoists: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను దారుణంగా కాల్చి చంపిన మావోయిస్టులు

|

Jan 31, 2021 | 5:32 AM

Chhattisgarh Maoists: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా ప్రతాప్‌పూర్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసు కానిస్టేబుల్‌ను మావోయిస్టులు దారుణంగా కాల్చి..

Chhattisgarh Maoists: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను దారుణంగా కాల్చి చంపిన మావోయిస్టులు
Follow us on

Chhattisgarh Maoists: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా ప్రతాప్‌పూర్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసు కానిస్టేబుల్‌ను మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపారు. అలాగే సిరియా పారా గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా, ఈ ప్రాంతం మావోయిస్టులకు అడ్డాగా మారింది. ఎప్పుడు మావోయిస్టుల కదలికలు ఉండే ఈ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. వారి కోసం ఎప్పటికప్పుడు గాలిస్తూనే ఉంటారు.

అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో శనివారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు. వీరిలో ఇద్దరిపై లక్ష చొప్పున రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం లోన్‌ వర్రాటు అనే పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శనివారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు.

Israel Embassy Blast : ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు..