కాటేసిందని కోపంతో.. పామును నోటితో కొరికి ముక్కలు చేశాడు..!

| Edited By:

Jul 29, 2019 | 5:53 PM

కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ.. మరికొన్ని విషయాలు మాత్రం గగుర్పొడుస్తాయి. అలాంటిదే.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటా జిల్లాలో జరిగిన ఆశ్చర్యకరమైన ఘటన. తాగిన మైకంలో ఓ మందుబాబు తాను ఓ మనిషన్న విషయం మరిచిపోయాడు. మద్యంమత్తులో ఉండగా రాజ్‌కుమార్ అనే వ్యక్తిని పాము కరిచింది. దాంతో.. కోపం కట్టలు తెచ్చుకున్నట్టుంది.. తనను కాటేసిన పామును వెతికి.. పట్టుకుని కొరికి ముక్కలు ముక్కలు చేశాడు. కానీ.. దాని కాటుకు గురైన రాజ్ కుమార్ పరిస్థితి విషమించింది. పాము విష […]

కాటేసిందని కోపంతో.. పామును నోటితో కొరికి ముక్కలు చేశాడు..!
Follow us on

కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ.. మరికొన్ని విషయాలు మాత్రం గగుర్పొడుస్తాయి. అలాంటిదే.. ఉత్తరప్రదేశ్‌లోని ఇటా జిల్లాలో జరిగిన ఆశ్చర్యకరమైన ఘటన. తాగిన మైకంలో ఓ మందుబాబు తాను ఓ మనిషన్న విషయం మరిచిపోయాడు. మద్యంమత్తులో ఉండగా రాజ్‌కుమార్ అనే వ్యక్తిని పాము కరిచింది. దాంతో.. కోపం కట్టలు తెచ్చుకున్నట్టుంది.. తనను కాటేసిన పామును వెతికి.. పట్టుకుని కొరికి ముక్కలు ముక్కలు చేశాడు. కానీ.. దాని కాటుకు గురైన రాజ్ కుమార్ పరిస్థితి విషమించింది. పాము విష ప్రభావంతో అతడు ఆస్పత్రిపాలయ్యాడు. రాజ్‌కుమార్‌ది పేదకుటుంబం కావడంతో.. వైద్యానికి డబ్బులు లేక.. అతని తండ్రి కనిపించిన ప్రతీ ఒక్కరినీ దీనంగా వేడుకుంటున్నాడు.