Tamil Nadu Elections: తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అప్పుడే నేతల కప్పదాట్లు మొదలయ్యాయి. భారీ లక్ష్యంతో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్కు ఆ పార్టీ కీలక నేత షాక్ ఇచ్చారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం.. కమల్కు షాక్ ఇస్తూ కమల తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరిపోయారు. అయితే తాను పార్టీ మారడానికి కమల్ హాసన్ వైఖరే కారణమని అరుచానం చెబుతున్నాడు. ఏది ఏమైనా.. మక్కల్ నీది మయ్యం పార్టీ ప్రస్థానమే పూర్తిగా ప్రారంభం కాని నేపథ్యంలో అప్పుడే ఆ పార్టీ నుంచి కీలక నేత జంప్ కావడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ జంపింగ్ జపాంగ్లను కమల్ ఎలా తట్టుకుంటారో వేచి చూడాల్సిందే.
Also read:
రైతులతో ప్రధాని మోదీ ముఖాముఖి, రైతు సమస్యలు, సంక్షేమ, అభివృద్ధి పథకాల లబ్దిపై ఆరా
New Year Celebrations: కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం… వెల్లడించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్…